హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తుచేశారు. 26 ఏండ్ల సర్వీస్ పూర్తిచేసిన ఈ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం అడిషనల్ డీజీ ర్యాంక్లో ఉన్నారు. ఇంకా ఆరేండ్ల సర్వీసు ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోమవారం ట్విట్టర్లో వెల్లడించారు. తన నిర్ణయాన్ని ప్రభుత్వ కార్యదర్శికి ఈ మెయిల్ ద్వారా తెలియజేసినట్టు పేర్కొన్నారు. తనపై నమ్మకంతో పలు బాధ్యతలు అప్పగించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. సంక్షేమభవనంలో ఈ తొమ్మిదేండ్లు తొమ్మిది నిమిషాలుగా గడిచిపోయిందని పేర్కొన్నారు. పదవీవిరమణ త ర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు, బీఆర్ అంబేద్కర్, కాన్షీరాం మార్గంలో పేదలకు అండగా ఉంటానని పేర్కొన్నారు.
హుజురాబాద్లో పోటీచేయను
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశం తనకు లేదని ప్రవీణ్కుమార్ స్పష్టంచేశారు. రాజకీయ ప్రవేశంపై ఇప్పుడే చెప్పలేనని తెలిపారు.