వనపర్తి : కరోనా ప్రబలకుండానే టీకాలను వేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి జూనియర్ కళాశాలలో సూపర్ స్పైడర్లకు టీకాల పంపిణీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వనపర్తిలో 2000 మంది సూపర్ స్పైడర్ లను గుర్తించామన్నారు. జర్నలిస్టులు, చౌకధర దుకాణాల డీలర్లు, పెట్రోల్ బంకులు, గ్యాస్ డెలివరీలో పనిచేసే సిబ్బంది, హమాలీలు, విత్తనాలు, పురుగుమందులు అమ్మేవారికి టీకాలు ఇస్తామన్నారు.
నిత్యం ఎక్కువమందిని కలుస్తుంటారు కాబట్టి వారికి మొదట టీకాలు వేస్తామన్నారు. కరోనా నియంత్రణలో అందరూ సహకరించాలని, లాక్ డౌన్ నిబంధనలు అందరూ పాటించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.