చెన్నై: శ్రీలంక లెజెండరీ క్రికెటర్, సన్రైజర్స్ హైదరాబాద్ సపోర్ట్ స్టాఫ్లో భాగమైన ముత్తయ్య మురళీధరన్కు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. ప్రస్తుతం సన్రైజర్స్ టీమ్ చెన్నైలో ఉండటంతో అతనికి అక్కడే ఓ ఆసుపత్రిలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. మార్చి చివర్లో మురళీధరన్లో ఓ బ్లాకేజ్ గుర్తించారని, అందుకే ఈ యాంజియోప్లాస్టీ నిర్వహించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక వికెట్ల రికార్డు మురళీధరన్ పేరిటే ఉంది. శ్రీలంక తరఫున 133 టెస్టుల్లో 800 వికెట్లు, 350 వన్డేల్లో 534 వికెటలు, 12 టీ20ల్లో 13 వికెట్లు తీశాడు. ఇలా మొత్తంగా 1347 అంతర్జాతీయ వికెట్లు మురళీ ఖాతాలో ఉన్నాయి. 1996లో శ్రీలంక వరల్డ్కప్ గెలవడంలో అతనిదే కీలక పాత్ర. 2015 నుంచి సన్రైజర్స్ టీమ్కు బౌలింగ్ కోచ్గా, మెంటార్గా ఉంటున్నాడు.
దేశంలో కరోనా కరాళ నృత్యం.. 24 గంటల్లో భారీగా కొత్త కేసులు
రాష్ట్రంలో కొత్తగా 4009 కరోనా కేసులు
భక్తులకు టీటీడీ కీలక సూచనలు
లాక్డౌన్ ఎఫెక్ట్ : రోడ్లపై జనాలే లేరు