హైదరాబాద్: ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుదివిడుత కౌన్సెలింగ్ కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదలచేసింది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఈ నెల 14 సాయంత్రం 6 గంటల వరకు తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలలవారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కోరింది. వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది.