జెరుసలాం: హమాస్ దాడితో అనేక మంది ఇజ్రాయిలీలు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే మరణించిన వారి కుటుంబాల్లో మళ్లీ ఆశలు చిగురించేలా ఇజ్రాయిలీ డాక్టర్లు ఓ అద్భుతం సృష్టించారు. యుద్ధంలో కుటుంబీకుల్ని కోల్పోయిన వారికి.. మళ్లీ సంతానం కలిగే రీతిలో పోస్తమస్ స్పెర్మ్ రిట్రీవల్(Posthumous Sperm Retrieval) పద్ధతికి క్లియరెన్స్ ఇచ్చారు. పోస్తమస్ స్పెర్మ్ రిట్రీవల్ అంటే మరణించిన వారి వృషణాల నుంచి వీర్యకణాలను తీసి.. ఆ వ్యక్తి సంబంధించిన వారిలో మళ్లీ సంతానం కలిగేలా చూడడమే దీని ఉద్దేశం. వీర్య కణాలను తీసిన తర్వాత.. ఆ కణాలను ఏదో ఒక సందర్భంలో ప్రెగ్నెన్సీ కోసం వాడుతారు.
హమాస్,ఇజ్రాయల్ యుద్ధం సమయంలో కప్లన్ ఆస్పత్రిలో పరిస్థితి భయానకంగా మారింది. ఆ టైంలో అక్కడ పనిచేస్తున్న ప్రొఫెసర్ దఫ్నా టేకోవా ఆ వాతావరణాన్ని చూసి కలత చెందింది. తోబొట్టువులు చనిపోతుంటే ఏడుస్తున్న ఇజ్రాయిలీలను చూసి ఆ డాక్టర్ ఓ వినూత్న ఐడియాను ప్రజెంట్ చేశారు. వీర్య కణాల సంరక్షణ ప్లాన్ను ఆమె ఇచ్చారు. పీఎస్ఆర్ విధానానికి ఆమె అనుమతి కోరారు. మరణించిన వారి నుంచి వీర్యకణాన్ని తీయడమే దీని ఉద్దేశం.
హమాస్ దాడి వల్ల నోవా ఫెస్టివల్లో చనిపోయిన వారి నుంచి తొలుత వీర్య కణాలను తీశారు. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ఇజ్రాయిలీ ఆస్పత్రులు స్పెర్మ్ ఫ్రీజింగ్ కోసం విజ్ఞాపనలు పెరిగాయి. ఫ్యామిలీ కోర్టు సమస్యలు రాకుండా కూడా వెంట వెంటనే చట్టాల్లో మార్పులు చేశారు. మనిషి చనిపోయిన 45 గంటల లోపు ఆ వ్యక్తి వృషణ కణజాలం నుంచి బ్రతికు ఉన్న స్పెర్మ్ను తీస్తారు. దీన్ని స్పెర్మ్ రిట్రీవల్ అంటారు. అయితే ఈ సర్వీస్ కోసం అభ్యర్థనలు పెరిగినట్లు ఇజ్రాయిలీ ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు.
ప్రస్తుతం ఇజ్రాయిల్లోని నాలుగు ఆస్పత్రుల్లో స్పెర్మ్ రిట్రీవల్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో ఇది జరుగుతోంది. అయితే దీంట్లో టైమింగ్ చాలా కీలకమైంది. మరణించిన తర్వాత తొలి 24 గంటల్లోనే స్పెర్మ్ డిటెక్షన్ వీలు అవుతుంది. లిక్విడ్ నైట్రోజన్లో వీర్యకణాలను స్టోర్ చేస్తారు.