హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): సింగరేణి నిర్మించి, విజయవంతంగా నిర్వహిస్తున్న సోలార్ ప్లాంట్లకు జాతీయ అవార్డు లభించింది. ఏషియన్ పసిఫిక్, సోలార్ క్వార్టర్ సంస్థలు అందజేసే సోలార్ ఎక్సలెన్స్ అవార్డును సొంతం చేసుకున్నది. ఢిల్లీలో సింగరేణి సంస్థ జీఎం (సోలార్) సూర్యనారాయణరాజు ఈ అవార్డును అందుకున్నారు. సింగరేణి సంస్థ రెండు దశల్లో 209 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ప్లాంట్ను ఏర్పాటుచేసింది. నవంబర్ నెలాఖరు వరకు 166 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తిచేసి రూ. 85 కోట్లు ఆదా చేశారు. సింగరేణి సోలార్కు తొలి జాతీయ అవార్డు రావడం పట్ల ఆ సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్, డైరెక్టర్ (ఈఅండ్ఎం) డీ సత్యనారాయణరావు హర్షం వ్యక్తంచేశారు.