హైదరాబాద్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ పి. విష్ణుదేవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు వర్సిటీ ఇంచార్జి వైస్ చాన్స్లర్ అరవింద్కుమార్ నియామక పత్రాన్ని అందజేశారు. వెంటనే ఆయన ఓయూ నుంచి రిలీవ్ అయి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా బాధ్యతలు చేపట్టారు. గత 22 ఏళ్లుగా ఓయూలో బోధన, పరిశోధన, పరిపాలన రంగాల్లో చురుకుగా పనిచేస్తున్న ప్రొఫెసర్ విష్ణుదేవ్ కేంద్రప్రభుత్వ బొగ్గు గనుల శాఖకు చెందిన నేషనల్ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్సీఐఎల్)కు ఇండిపెండెంట్ డైరెక్టర్గా 2018 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2014 నుంచి జర్మనీలోని టుబింగన్ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్గా సైతం పనిచేస్తున్నారు.