ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వకీల్ సాబ్ హంగామా నడుస్తుంది. ఎక్కడ చూసిన వకీల్ సాబ్ సినిమా గురించే చర్చ. మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం వకీల్ సాబ్ కావడంతో ఈ మూవీని చూసేందుకు జనాలు థియేటర్స్ దగ్గర బారులు తీరుతున్నారు. తమ హీరోని వెండితెరపై చూసి ఉద్వేగానికి లోనవుతున్నారు.
వకీల్ సాబ్ సినిమా చూస్తున్నంత సేపు ఫ్యాన్స్ తమను తాము మైమరచిపోయి ఆనందంతో ఊగిపోతున్నారు. అలాంటి సమయంలో అంతరాయం ఏర్పడింది. ఇంకేముంది నానా రచ్చ చేశారు. గద్వాల జిల్లాలోని శ్రీనివాస టాకీస్ లో వకీల్ సాబ్ మూవీ బెనిఫిట్ షో వేశారు . కాసేపటి తర్వాత సినిమా ప్రదర్శనలో అంతరాయం ఏర్పడింది. ఎంతకు సినిమా ప్రదర్శన జరపకపోవడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. థియేటర్లో కుర్చీలు విరగ్గొట్టారు. టాకీసు ముందు కూర్చొని ఆందోళన చేశారు. ఇంత జరిగినప్పటికీ.. థియేటర్ యాజమాన్యం ఫ్యాన్స్ కు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనర్హం.