సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘డర్టీపిక్చర్’ సినిమాలో సిల్క్స్మితగా విద్యాబాలన్ మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు రాబట్టి కమర్షియల్ సక్సెస్గా నిలువడమే కాకుండా.. విద్యాబాలన్కు జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. మిలన్ లూథ్రియా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏక్తాకపూర్, శోభాకపూర్ నిర్మాతగా వ్యవహరించారు. 2011 డిసెంబర్ 2 న విడుదలై రికార్డులను బ్రేక్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాత జ్ఞాపకాలను నెమరేసుకున్న విద్యాబాలన్.. సినిమాను చూసిన తర్వాత తన తండ్రి ఒక రకంగా, తల్లి మరో రకంగా స్పందించారని తెలిపింది.
‘డర్టీ పిక్చర్’ సిద్ధమైన తర్వాత తొలుత తల్లిదండ్రులతో కలిసి చూశానని, అయితే తన తండ్రేమో చప్పట్లు కొట్టి నన్ను అభినందించగా.. తన తల్లి మాత్రం తన రోల్ చూసి ఏడ్చిందని చెప్పారు. ‘ఈ సినిమా చేయడానికి నాకు మద్దతు ఉన్నది. అయితే, నేనెప్పుడు దాన్ని తీర్పుగా చూడలేదు. ఉదాహరణకు ‘డర్టీ పిక్చర్’ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక థియేటర్లో ఫ్యామిలీతో వెళ్లాను. రియాక్షన్ ఎలా ఉంటుందో అనుకుంటూ ఇంట్రవెల్లో ఓ మూల నిలబడ్డాను. తనను చూసిన తండ్రి చప్పట్లు కొడుతూ వచ్చి ఈ సినిమాలో నా కూతుర్నే చూడలేకపోయాను అని చెప్పాడు. సినిమా పూర్తయ్యాక అమ్మ మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నది. ఆ పాత్ర అలా చనిపోవడాన్ని జీర్ణించుకోలేక అమ్మ ఏడ్చేసిందంట. అంతవరకు మరీ ముఖ్యంగా, నేను చీప్గా కనిపిస్తున్నానని ఒక్క క్షణం కూడా ఆమెకు అనిపించలేదని చెప్పడం నాకు భారీ అభినందనగా భావించా. ఎందుకంటే సెక్సీగా, సొగసైనదిగా ఉండటానికి మధ్య సన్నని గీత ఉంటుది. నా పాత్రను అభిమానించిన ప్రేక్షకులకు కృతజ్ఞురాలును’ అని చెప్పారు విద్యాబాలన్.