న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) జీఎస్ఎల్వీ-ఎఫ్ 17 రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతున్నది. దీని ద్వారా దేశంలోనే మొట్టమొదటి జియో స్టేషనరీ ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్-05(జీశాట్-1ఏ)ను నింగిలోకి పంపనున్నది. సెప్టెంబర్ 4న శ్రీహరికోటలోని సతీ ష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి దీనిని ప్రయోగించనున్నది.భూమికి సుమా రు 36,000 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టే ఈ అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం భూ భ్రమణ వేగంతో సమానంగా తిరుగుతూ, భారత ఉపఖండంపై నిరంతరం స్థిరంగా ఉండి, ప్రతి 30 నిమిషాలకు ఒకసారి(ప్రత్యేక పరిస్థితుల్లో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి) సరికొత్త చిత్రాలను అందిస్తుంది. తద్వా రా తుఫానులు, వరదలు, కార్చిచ్చులు వంటి ఆకస్మిక ప్రకృతి విపత్తులను పసిగట్టడంతో పాటు, దేశ సరిహద్దులపై రియల్ టైమ్ వ్యూహాత్మక నిఘా ఉంచేందుకు, వాతావరణ మార్పులను నిత్యం కచ్చితత్వంతో పర్యవేక్షించేందుకు ఈ మిషన్ కీలకపాత్ర పోషించనున్నది.