అతనో ప్రభుత్వ ఉద్యోగి.. కానీ విధులకు సక్రమంగా హాజరుకాడు.. అయినా సంతకాలు మాత్రం పెడుతాడు.. తోటి ఉద్యోగులపై పెత్తనం చెలాయిస్తాడు.. సంబంధిత కార్యాలయంలో పై అధికారి ఉన్నా.. ఆయన చెప్పిందే వేదం.. చివరికి ఉద్యోగులకు జీతం రావాలన్నా చేయి తడపాల్సిందే.. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని పే అండ్ అకౌంట్స్ కార్యాలయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. వేధింపులు భరించలేక ఆధారాలతో ఎంప్లాయీస్ అంతా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఒకవేళ వేధింపులకు గురిచేసినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని కార్యాలయ చీఫ్ చెప్పారు. అయితే వివరాల సేకరణ కోసం సంబంధిత ఆఫీస్ను ‘నమస్తే తెలంగాణ’ విజిట్ చేసిన సమయంలో సదరు ఉద్యోగి విధులకే హాజరుకాలేదు.
మహబూబ్నగర్, మార్చి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అతనో సీనియర్ అసిస్టెంట్.. పదోన్నతిపై వచ్చాడు.. అదే కార్యాలయంలో పదోన్నతి పొందిన వారు ఉన్నా అ తనిదే ఇష్టారాజ్యం. పై అధికారి పేరు చెప్పి తో టి ఉద్యోగులను వేధిస్తున్నాడు. అంతేకాకుండా ప్రతి నెలా కావాలంటే ఆమామ్యాలు స మర్పించుకోవాల్సిందే. లంచాన్ని ఈ ఏడాది నుంచి పెంచాడు. అడిగినంత ఇవ్వకుంటే ఆబ్ సెంట్ వేస్తానని, జీతం కట్ అవుతుందని బెదిరింపులకు గురిచేస్తున్నాడు. దీంతో ఏం చేయలే క తోటి ఉద్యోగులంతా ఉన్నతాధికారులకు ఫి ర్యాదు చేశారు. ఈ వ్యవహరం ‘నమస్తే తెలంగాణ’కు తెలియడంతో మంగళవారం కార్యాలయానికి వెళ్లగా.. సదరు ఉద్యోగి సీటుపై కనపడలేదు. వారం రోజులుగా ఆఫీసుకు రావడం లేద ట. అయినా ఇష్టం వచ్చిన రోజు వచ్చి అన్ని సంతకాలు ఒకేసారి పెడుతున్నట్లు తేటతెల్లమైం ది. దీంతో పై అధికారిని వివరణ కోసం ప్రయత్నించగా.. ఆయన సెలవులో ఉన్నానని, ఈ ఆరోపణలపై విచారణ జరిపిస్తానని, నిజం అని తే లితే చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో కార్యాలయ ఉద్యోగుల్లో అలజడి ప్రారంభమైంది.
నాగర్కర్నూల్ జిల్లాలోని నీటి పారుదల శా ఖ ఉద్యోగుల జీతాలు, ప్రాజెక్టుల చెల్లింపుల కోసం ఉప గణాంకాధికారి కార్యాలయాన్ని (పే అండ్ అకౌంట్స్) ఏర్పాటు చేశారు. ఇక్కడికి ప్రమోషన్పై ఇతర జిల్లా నుంచి వచ్చిన సీనియ ర్ అసిస్టెంట్.. పెత్తనం చెలాయిస్తున్నాడు. ఉన్నతాధికారులు తాను చెప్పినట్లు వింటాడని చెబుతూ తోటి ఉద్యోగులతోనే వసూళ్ల పర్వానికి తెరలేపాడు. కాగా, ఇదే శాఖలో వివిధ స్థాయి లో పనిచేస్తూ చాలా మంది సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు. ఇటీవల జోన్ల వారీగా బదిలీలు కాగా, పై అధికారులు కొందరిని ఇక్కడే కొనసాగించారు. ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల జీతభత్యాల ఫైల్స్ను చూసే సదరు వ్యక్తి.. తోటి ఉద్యోగులను టార్గెట్ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థ రద్దుచేసి కొందరిని ఈ శాఖకు అటాచ్ చేసింది. దీంతో అంతా తానే అయినట్లు బిల్డప్ ఇస్తూ తోటి ఉద్యోగులకు వేధిస్తున్నట్లు తెలుస్తున్నది.
ఇప్పటినుంచి ఎక్కువ ఇవ్వాల్సిందే..
పే అండ్ అకౌంట్స్ కార్యాలయంలో పనిచే సే ఉద్యోగులంతా సదరు వ్యక్తికు సమాన స్థా యి వారే. పదోన్నతి వచ్చి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న సమయంలో.. ఆయన తోటి ఉద్యోగులను హడలెత్తిస్తున్నాడు. లంచం ఇవ్వనందుకు నెలనెలా ఉన్నతాధికారులకు పం పించే అటెండెన్స్లో జిమిక్కులు చేస్తున్నాడు. దీంతో జీతం తక్కువ వస్తుందని భయపడిన ఉ ద్యోగులు.. అతను చెప్పింది సమర్పించుకుంటున్నారు. తాజాగా ఈ ఏడాది నుంచి కమీషన్ పెంచేయడంతో ఉద్యోగులు ఖంగుతిన్నారు. ఈ విషయాన్ని పై అధికారికి విన్నవిస్తే.. మీరే మా ట్లాడుకోవాలి అని జవాబు వచ్చినట్లు ఉద్యోగులు వాపోతున్నారు. దీంతో ఉద్యోగులంతా ఉ న్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది.
నిజమని తేలితే చర్యలు తీసుకుంటాం..
మా కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి వేధిస్తున్నట్లు నాకు తెలియదు. విచారణ జరిపి నిజమని తేలితే ఉన్నతాధికారులు నివేదించి చర్యలు తీసుకుంటాం. మంగళవారం డ్యూటీకి రాకపోవడంపై వివరణ అడుగుతాం. నేను జేడీ కార్యాలయానికి ఆఫీస్ పనిమీద వచ్చాను. రేపు సెలవులో ఉంటాను. శుక్రవారం ఆఫీస్కు వచ్చి విచారణ జరుపుతాం. ఉద్యోగులు విధిగా హాజరుకావాలి.
– పే అండ్ అకౌంట్స్ కార్యాలయం అధికారి, నాగర్కర్నూల్
అప్పుడప్పుడు వచ్చి.. సంతకాలు పెడుతూ..
తోటి ఉద్యోగులతో లంచాలు తీసుకుంటున్న వ్యక్తి నాగర్కర్నూల్లోనే ఉంటున్నాడు. కానీ డ్యూటీకి మాత్రం రావడం లే దు. గతంలో ఏకంగా నెలల తరబడి రాకున్నా.. జీతం మాత్రం టంఛన్గా తీసుకున్నాడు. అయితే, అటెండెన్స్ పంపించే బాధ్యతను ఇతనికి అప్పగించడంతో.. ఇదే అదునుగా తోటి ఉద్యోగులను సతాయించడం ప్రారంభించాడని ఓ ఉద్యోగి వాపోయా డు. మంగళవారం సాయంత్రం కార్యాలయం విధులు ముగిసే సమయానికి కూడా కార్యాలయానికి రాలేదు. సోమవారం కూడా రాకుండానే.. మంగళవారం సంతకం పెట్టి వెళ్లిపోయా డు. అతను ఎప్పుడు వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోయినా అడిగే నాథుడే లేడు. అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించగా లీవ్ పెట్టిన ట్లు కూడా సమాచారం లేదు. తాను ఇష్టం వచ్చినప్పుడు వస్తాడని.., సంతకాలు ఎప్పుడంటే అప్పుడు పెడుతాడని తోటి ఉ ద్యోగులే చెబుతున్నారు. ఇదిలా ఉండగా పే అండ్ అకౌంట్స్ అధికారి కూడా 13 రోజులుగా విధులకు రావడం లేదని రిజిస్టర్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ఈనెల 1న మాత్రమే సంతకాలు పెట్టడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కార్యాలయంలో జరుగుతున్న దానిపై విచారణ జరిపి విధులకు ఎగనా మం పెడుతూ.., తోటి ఉద్యోగులను లంచం కోసం వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.