కాట్మాండు: నేపాల్లో సంభవించిన జల ప్రళయం(Nepal Floods)తో త్రిశూలీ పవర్ ప్రాజెక్టు టన్నెల్ మూసుకుపోయిన విషయం తెలిసిందే. అయితే వరదలు వచ్చిన 9 రోజుల తర్వాత ఇవాళ రెస్క్యూ సిబ్బంది ఇద్దర్ని సజీవంగా కాపాడారు. త్రిశూలీ 3ఏ ప్రాజెక్టు టన్నెల్ నుంచి ఇద్దర్ని రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఆ ఇద్దర్నీ ఫోర్మెన్ సంజయ్ సాహ(30), సూపర్వైజర్ కబీర్ మహార్జన్(45)గా గుర్తించారు. సంజయ్ సాహ మట్లాడుతూ.. జల విలయం సంభవించిన సమయంలో టన్నెల్లోని కార్మికులను సురక్షిత ప్రదేశానికి తరలిస్తున్న సమయంలో తాను ట్రాప్ అయినట్లు పేర్కొన్నాడు. కనీసం నలుగురితో ఆ టన్నెల్లో టచ్లో ఉన్నట్లు అతను చెప్పాడు. నేపాల్ వరదల వల్ల సుమారు 12 హైడ్రోపవర్ ప్రాజెక్టులు ధ్వంసం అయ్యాయి. వీటిల్లో సుమారు 900 మంది కార్మికులు చిక్కుకున్నారు. దీంట్లో ఇంజినీర్లు, సూపర్వైజర్లు కూడా ఉన్నారు. నేపాల్ ఆర్మీ నేతృత్వంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక ఎక్విప్మెంట్ సహకారంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. టన్నెల్లో చిక్కుకున్న కొందరితో రెస్క్యూ సిబ్బంది మాట్లాడినట్లు తెలుస్తోంది.
#WATCH | Nepal | Rescue workers rescue one person from inside the tunnel of the Trishuli 3A hydel project
Video source: Secretariat of the Ministry of Energy, Water Resources and Irrigation, Govt of Nepal pic.twitter.com/tNZTMoWgIp
— ANI (@ANI) September 4, 2026