డెహ్రాడూన్ : రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తిరత్ సింగ్ రావత్ కొవిడ్ చికిత్స కేంద్రాన్ని పరిశీలించారు.
డెహ్రాడూన్లోని రాజ్పూర్ రోడ్డు క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన తాత్కాలికంగా కొవిడ్ చికిత్స కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించి రోగులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.
ఆయన వెంట రాయ్పూర్ ఎమ్మెల్యే ఉమేశ్ శర్మ, రాజ్పూర్ రోడ్డు ఎమ్మెల్యే ఖాజన్ దాస్తోపాటు జిల్లా కలెక్టర్ అషీష్ శ్రీవాత్సవ ఉన్నారు.
ఇప్పటికే ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఇక్కడ 2150 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 27 మరణాలు సంభవించాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి