లండన్: తొలి ఏఐ ఆధారిత మెదడు శస్త్రచికిత్స విజయవంతంగా లండన్లో పూర్తి చేశారు. యూకేకు చెందిన హిబర్ట్ (48) బ్రెయిన్లో చిన్న సైజులో ట్యూమర్ ఏర్పడింది. కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉండటంతో డాక్టర్లు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఈ ట్యూమర్ తొలగించే సమయంలో దగ్గర్లోని రక్తనాళాలు, నరాలకు నష్టం కలిగే ప్రమాదం ఉంది.
దీంతో డాక్టర్లు ఏఐతో శస్త్రచికిత్స చేయాలనుకున్నారు. లైవ్ వీడియో ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన ఏఐ టూల్ వైద్యులు ఏ మార్గంలో వెళ్లాలో సూచనలు చేసింది. ఎండోస్కోప్ కెమెరా ద్వారా ఏఐ టూల్ సున్నితమైన నరాలు లేని మార్గాన్ని సూచించింది. వాటిని విశ్లేషించుకుని డాక్టర్లు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.