సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం సాయంత్రం 6 గంటల వరకు లాక్డౌన్ సడలించడంతో ఏపీ నుంచి రాష్ట్రంలోకి భారీగా వాహనాలు వస్తున్నాయి. దీంతో అప్రమత్తమయిన పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ-పాస్ ఉన్న వాహనాలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. పాసులు లేని వాహనాలను వెనక్కు పంపుతున్నారు. పోలీసులు అనుమతించకపోతారా.! అనే ఆశతో కొంతమంది వాహనదారులు రోడ్డుపై వాహనాలను నిలిపి నిరీక్షిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. హైద్రాబాద్-విజయవాడ జాతీయరహదారిపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.