Alia Bhatt | బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నది. గతేడాది నవంబర్లో అలియా కుమార్తె రాహా కపూర్కు జన్మనిచ్చింది. అభిమానులు వీలైనంత త్వరగా అలియాను సిల్వర్ స్క్రీన్పై చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అలియా భట్ తన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం మెటర్నిటీ బ్రేక్ను తాను ఎంజాయ్ చేస్తున్నానన్న అలియా.. కుమార్తె రాహాను గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పింది. కుటుంబ జీవితంపై దృష్టి పెట్టడం వల్ల కెరీర్ నెమ్మదించదా? అని ప్రశ్నించగా.. అలియా స్పందిస్తూ ‘ప్రస్తుతం నా జీవితంలో ప్రాధాన్యాలు మారాయి. తొలి ప్రాధాన్యం నా కూతురుకే. సినిమా నా ఫస్ట్లవ్. నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను’ అని చెప్పుకొచ్చింది.
అయితే, క్వాంటిటీ కంటే క్వాలిటీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానన్న ఆలియా.. తన కుమార్తె రాహాకు రెండు సంవత్సరాలు వచ్చే వరకు తనకు సంబంధించిన ఎలాంటి ఫొటోలను తీయొద్దని కోరింది. ఈ సందర్భంగా పఠాన్ చిత్రం విజయంపై స్పందించింది. ‘చాలా చాలా సంతోషంగా ఉంది. పఠాన్లాంటి సినిమా కేవలం బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు. భారతీయ సినిమాల్లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్.
ప్రతి కొత్త సినిమా ఇలాగే రికార్డులు బద్దలు కొడుతూనే ఉంటుంది’ అని వ్యాఖ్యానించింది. ఒక విరామం తర్వాత అలియా ‘రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నది. రణ్వీర్ సింగ్ చిత్రంలో హీరోగా కనిపించనున్నాడు. అలాగే త్వరలో ‘జీ లే జరా’ చిత్రంలోనూ కనిపించనుంది. కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రాతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. అలియా చివరిసారిగా ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో కనిపించింది.