Yodha Movie | ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై కరణ్జోహర్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘యోధ’(Yodha). గతా ఏడాది షేర్షాతో హిట్ కొట్టిన బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా (Siddarth Malhotra) ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా.. దిశా పటానీ, రాశి ఖన్నా కథనాయికలుగా నటిస్తున్నారు. సాగర్ అంబ్రే, పుష్కుర్ ఓజా ఈ సినిమాను సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
ఇక ఈ టీజర్ గమనిస్తే.. టెర్రరిస్టులు విమానం హైజాక్ చేసినట్లు చూపించారు. అయితే ఈ హైజాక్లో చిక్కుకున్న ప్రజల ప్రాణాలను కాపాడే కమాండర్ ఆఫీసర్గా సిద్ధార్థ్ మల్హోత్రా కనిపించబోతుండగా.. రాశి ఖన్నా ప్రభుత్వ అధికారిణి పాత్రలో నటిస్తోంది. ఈ టీజర్లో సిద్ధార్థ్ మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను 15 మార్చి 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అమెజాన్ స్టూడీయోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.