బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ఖాన్ కథానాయకుడిగా టాలీవుడ్ దర్శకుడు పైడిపల్లి వంశీ దర్శకత్వంలో దిల్ రాజు ఓ బాలీవుడ్ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘ది మాన్స్టర్’ అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు. నయనతార కథానాయిక నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఇటీవలే ఈ సినిమా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా సల్మాన్ఖాన్ డూప్గా నటిస్తున్న వ్యక్తికి గుండెపోటు రావడం జరిగింది.
దాంతో షూటింగ్ ఆలస్యం కాకూడదనే ఉద్దేశ్యంతో సల్మాన్ఖానే స్వయంగా యాక్షన్ సీక్వెన్స్లో నటిస్తున్నారు. దక్షిణాది టెక్నీషియన్సే ఎక్కువగా ఈ సినిమాకు పనిచేస్తుండటం విశేషం. దాంతో బాలీవుడ్తోపాటు టాలీవుడ్, కోలీవుడ్ మార్కెట్ కూడా ఈ సినిమాకు భారీగా దక్కే అవకాశం ఉన్నది. వచ్చే ఏడాది ఈద్ కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు దిల్రాజు సన్నాహాలు చేస్తున్నారు.