ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథా విస్తృతి దృష్ట్యా పార్ట్-1, పార్ట్-2లుగా తెరకెక్కిస్తేనే బాగుంటుందనే ఆలోచనలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉన్నట్లు చెబుతున్నారు. రెండు భాగాల ట్రెండ్కు ప్రస్తుతం ఆదరణ ఉండటంతో ఆ దిశగా చిత్రబృందం కథలో మార్పులు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. జనవరిలో లాంఛనంగా ఈ సినిమా ప్రారంభమైంది. గోదావరిఖని బొగ్గు గనుల్లో ప్రభాస్పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత కరోనా కారణంగా షూటింగ్ వాయిదాపడింది. త్వరలో చిత్రీకరణను పునఃప్రారంభించే యోచనలో ఉన్నారు.హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది.