రిలయన్స్ రికార్డు
ముంబై, మే 1: రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన జామ్నగర్లోని రిఫైనరీలో రోజుకు 1,000 టన్నుల మెడికల్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేయనున్నట్టు సంస్థ వెల్లడించింది. తద్వారా దేశంలో ఒకే కేంద్రం నుంచి అత్యధిక మొత్తంలో మెడికల్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తున్న పరిశమ్రగా రిలయన్స్ రికార్డు సృష్టించింది. ఇండియాలో రోజూ ఉత్పత్తి అవుతున్న మొత్తం మెడికల్ ఆక్సిజన్లో ఇది 11% కావడం గమనార్హం. ‘ప్రస్తుత కరోనా ఉద్ధృతిలో ప్రజల ప్రాణాలు కాపాడటం కంటే నాకు కానీ, రిలయన్స్కు కానీ వేరే ఏదీ ముఖ్యం కాదు’ అని రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ అన్నారు.