Airtel | ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ తన సబ్స్క్రైబర్ల కోసం సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. రూ.148 టారిఫ్తో 15 జీబీ డేటా అందిస్తుంది. ఎక్స్ ట్రీమ్ ప్లే సబ్ స్ర్కిప్షన్ కూడా పొందొచ్చు. ఈ ప్లాన్ను యాక్టివ్ ప్లాన్ లోనే కలిపేసుకోవచ్చు. ఈ ప్లాన్ ఎంచుకున్న కస్టమర్లు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా వీక్షించవచ్చు.
ఇప్పటికే బేస్ ప్రీ-పెయిడ్ ప్లాన్ యూజర్లకు ఎయిర్ టెల్ కొత్త ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. బేస్ ప్లాన్ వ్యాలిడిటీ ఉన్నంత కాలం ఈ డేటా ప్లాన్ అమలవుతుంది. రూ.148 డేటా ఓచర్ ఎంచుకుంటే 15 జీబీల డేటా లభిస్తుంది. దీనివల్ల వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్లు, ఇతర బెనిఫిట్లు ఉండవు.
రూ.148 డేటా ఓచర్ ప్లాన్ ఎంచుకున్న వారికి లయన్స్ గేట్ ప్లే, సోనీ లివ్ ప్రీమియం, ఎరోస్ నౌ, హొచోయి వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వీక్షించవచ్చు. 28 రోజుల పాటు ఎక్స్ ట్రీమ్ ప్లే స్ట్రీమ్ సేవలు పొందొచ్చు.