ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు దాఖలుకు మరో 3 రోజులు మిగిలి ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్-కం-కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు ఆన్లైన్ అప్లికేషన్ డెడ్లైన్ ఈ నెల 29 న ముగియనున్నది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 670 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు 18 నుంచి 42 ఏండ్లలోపు వయసున్న అభ్యర్ధులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
దరఖాస్తు గడువు జనవరి 19తో ముగియగా.. నిరుద్యోగుల అభ్యర్ధన మేరకు దరఖాస్తుల దాఖాలు గడువును జనవరి 29 వరకు పొడిగించారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు చివరి తేదీ వరకు వేడి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిదని ఏపీపీఎస్సీ అధికారులు సూచిస్తున్నారు. అభ్యర్ధులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in.లో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.