Lok Sabha Elections : దేశంలో ఎక్కడ చూసిన లోక్సభ ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. నామినేషన్లు వేసే అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ప్రచారంలో బిజీబీజీగా ఉన్నారు. ఉత్తరాఖండ్లో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
హరిద్వార్ లోక్సభ నియోజకవవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన తన కుమారుడు వీరేంద్ర రావత్ తరఫున హరీశ్ రావత్ ప్రచారం చేశారు. సోమవారం రాత్రి జ్వాలాపూర్ ఏరియాలో హరీశ్రావత్, వీరేంద్ర రావత్ ప్రచారం నిర్వహించారు. తన కొడుకును భారీ మెజారిటీతో గెలిపించాలని హరీశ్రావత్ ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన సమోసాలు కాల్చారు, టిక్కీలు చేశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.
#WATCH | Lok Sabha elections 2024 | Former Uttarakhand CM and senior Congress leader Harish Rawat campaigned for his son and party candidate from Haridwar, Virendra Rawat on 15th April.
During the campaigning, he made ‘Tikki’ at a chaat shop in Jwalapur and interacted with the… pic.twitter.com/IyoeAZ4dFz
— ANI (@ANI) April 16, 2024