అగ్ర కథానాయిక నయనతార నిర్మాతగా వ్యవహరించిన ఓ తమిళ చిత్రం ఆస్కార్ ఎంట్రీని దక్కించుకున్నది. కాబోయే భర్త, దర్శకుడు విఘ్నేష్శివన్తో కలిసి ఆమె ‘కూజంగల్’ (పెబెల్స్) పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. తన కుటుంబంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు పి.ఎస్ వినోథ్రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాగుబోతు తండ్రికి, అతడికి కుమారుడికి మధ్య చోటుచేసుకున్న సంఘటనలు..వారి జీవన సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా 2021 సంవత్సరానికిగాను ప్రదానం చేయనున్న 94వ ఆస్కార్ పురస్కారాల్లో ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరిలో మన దేశం తరపున ఎంపికైంది. ‘కూజంగల్’ ఆస్కార్ బరిలో నిలవడం పట్ల నిర్మాత విఘ్నేష్ శివన్ ఆనందాన్ని వ్యక్తంచేశారు. ‘ఆస్కార్ గెలుచుకునేందుకు కేవలం రెండు అడుగుల దూరంలో ఉన్నాం. నిర్మాతగా మంచి కంటెంట్ను తెరకెక్కించినందుకు గర్వపడుతున్నా’ అని తెలిపారు.