సుశాంత్ పెంపుడు కుక్క మృతి.. ఫ్యాన్స్ భావోద్వేగం
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ పెంపుడు శునకం ఫడ్జ్ మరణించింది.
ఈ విషయాన్ని సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఫడ్జ్.. స్వర్గంలో ఉన్న నీ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లిపోయావు. మేము కూడా ఏదో ఒకరోజు మీ దగ్గరికొస్తాం. అప్పటిదాకా మాకు ఈ బాధ తప్పదు అంటూ భావోద్వేగంగా ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్తో పాటు ఫడ్జ్తో సుశాంత్ దిగిన పాత ఫొటోలను ప్రియాంక సింగ్ జత చేసింది.
ముంబైలో ఉన్న సమయంలో సుశాంత్కు తోడుగా ఫడ్జ్ ఉండేది. దానిని ఎంతో గారాబంగా చూసుకునేవాడు.
సుశాంత్ మరణించిన తర్వాత ఫడ్జ్ కూడా ఆ బాధలోనే ఉండిపోయింది.
ఈ మూడేళ్లుగా ఫడ్జ్ అంత యాక్టివ్గా ఉండేది కాదని సుశాంత్ సోదరి తెలిపింది.
ఇప్పుడు ఫడ్జ్ మరణ వార్త తెలిసిన నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.