ఇరిగేషన్‌ ఈఎన్సీ మురళీధర్‌రావు రాజీనామాకు ఆదేశం.. సాగునీటి శాఖలో భారీ మార్పులు

రాష్ట్ర నీటిపారుదల శాఖలో ఇద్దరు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్సీ)లపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈఎన్సీ (రామగుండం) ఎన్‌ వెంకటేశ్వర్లును సర్వీస్‌ నుంచి తొలగించింది. ఈఎన్సీ మురళీధర్‌ను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు ఇరిగేషన్‌ శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.