IPL 2025 | పంజాబ్‌ కింగ్స్‌కు షాక్‌.. మిగతా మ్యాచులకు స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం..

IPL 2025 | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పంజాబ్‌ జట్టు రాణిస్తున్నది. చెన్నైతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ విజయం సాధించింది. అయితే, ఆ జట్టుకు షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మిగతా మ్యాచులకు దూరం కానున్నాడు. వేలు ఫ్యాక్చర్‌ కావడంతో మిగతా మ్యాచులు ఆడడం కష్టంగా మారింది.