కావలసిన పదార్థాలు : మైదా పిండి: ఒక కప్పు, కసూరిమేతి: ఒక టేబుల్ స్పూన్, కారం: ఒక టీస్పూన్, వేయించిన జీలకర్ర పొడి, జీలకర్ర, వాము: అర టీస్పూన్ చొప్పున, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం: ఒక గిన్నెలో మైదా, కారం, జీలకర్ర, జీలకర్ర పొడి, వాము, ఉప్పు, కసూరిమేతి వేసి బాగా కలపాలి. రెండు టేబుల్ స్పూన్ల వేడి నూనె కూడా వేసి తగినన్ని నీళ్లుపోసి పిండిని ముద్దలా కలపాలి. స్టవ్మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి, బాగా వేడయ్యాక పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసి చెక్కల్లా ఒత్తుకుని దోరగా కాల్చుకుంటే నోరూరించే మెంతి చెక్కలు సిద్ధం. మైదా ఇష్టపడని వాళ్లు బియ్యపు పిండి, గోధుమ పిండితోనూ చేసుకోవచ్చు.