కావలసిన పదార్థాలు
మైదా పిండి: ఒక కప్పు, చక్కెర: ఒక కప్పు, రోజ్ సిరప్: పావు కప్పు, ఉప్పు: చిటికెడు, బేకింగ్ సోడా: చిటికెడు, యాలకుల పొడి: అర టీస్పూన్, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
ఒక గిన్నెలో మైదాపిండి, ఉప్పు, బేకింగ్ సోడా, ఒక టేబుల్ స్పూన్ రోజ్ సిరప్ వేసి బాగా కలపాలి. తర్వాత, తగినన్ని నీళ్లుపోసి జారుగా కలిపి అరగంటపాటు నానబెట్టాలి. స్టవ్మీద పాన్పెట్టి చక్కెర, ఒక గ్లాసు నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. లేతపాకం వచ్చాక యాలకుల పొడి, టేబుల్ స్పూన్ రోజ్ సిరప్ వేసి కలగలిపి దించేయాలి. స్టవ్మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడి చెయ్యాలి. పిండి మిశ్రమాన్ని బాటిల్లోగానీ, కవర్లోగానీ వేసి చిన్న రంధ్రం ద్వారా వేడి నూనెలో జిలేబీలు ఒత్తుకుని సన్నని మంటపై దోరగా కాల్చాలి. ఆ జిలేబీలను చక్కెర పాకంలో వేసి అయిదు నిమిషాలు నాననిస్తే నోరూరించే రోజ్ జిలేబీ సిద్ధం.