కరోనా తర్వాత..

సంవత్సర కాలం నుంచీ కరోనా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. కోట్లమంది ఈ వైరస్ బారినపడ్డారు. ముందు నుంచీ.. కరోనా అనంతరం తలెత్తే శారీరక, మానసిక సమస్యల గురించీ ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించీ మాట్లాడేవారు తక్కువే. కొణిదెల వారి కోడలు ఉపాసన కామినేని కరోనా అనంతర సమస్యలపై చర్చించేందుకు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యువర్లైఫ్.కో.ఇన్(urlife.co.in) ద్వారా నిపుణుల సూచనలు ఇప్పిస్తున్నారు. గాయని కనికా కపూర్ ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించింది. ‘కరోనా వ్యాక్సిన్ పుణ్యమాని ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నాం. రామ్ చరణ్కు పాజిటివ్ రావడంతో కరోనా అనంతరం శారీరకంగా, మానసికంగా ఎదురయ్యే సమస్యల గురించి తెలుసుకునే అవకాశం లభించింది. మార్చి 31 వరకు రోజుకొక నిపుణుడు కరోనా అనంతర పరిస్థితులపై చర్చిస్తారు’ అంటూ కార్యక్రమ విశేషాలను పంచుకున్నారు ఉపాసన.
తాజావార్తలు
- తెలంగాణలో మండుతున్న ఎండలు
- మోసపోయి.. మోసం చేసి
- 05-03-2021 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
- రైల్వేలో ఉద్యోగాలంటూ మస్కా
- పీడీయాక్టు పెట్టినా మారలేదు..
- అన్ని వర్గాల మద్దతు వాణీదేవికే..
- జీవితానికి భారంగా ఊబకాయం
- ఎన్నికల ఏర్పాట్లలో లోపాలు ఉండొద్దు
- పెండ్లి గిఫ్ట్ అంటూ.. 11.75లక్షలు టోకరా
- నిర్మాణ రంగంలో కేంద్ర బిందువు