వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) సంస్థ భారత రాయబారిగా ఉపాసన కామినేని నియమితులయ్యారు. ‘ఫారెస్ట్ ఫ్రంట్లైన్ హీరోస్’కు ఆమె బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. దేశ వ్యాప్తంగా అడవులను సంరక్షించడం, వన్యప్రాణులను కాపాడటం పట్ల ఉపాసన ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. వీటికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించేవారికి బాసటగానూ నిలుస్తారు. ఈ విషయాన్ని ఉపాసన ట్విటర్ద్వారా ప్రకటించారు. అభివృద్ధిని పంచుకునేందుకే డబ్ల్యూడబ్ల్యూఎఫ్- ఇండియాలో చేరుతున్నట్లు స్పష్టంచేశారు. ‘వనవీరులు ప్రతి పనినీ సవాలుగా భావిస్తారు. అడవులను సంరక్షించడం, పునరుద్ధరించడంలో వారి పాత్ర కీలకం. ఆ హరిత ఉద్యమానికి మద్దతు తెలుపాలని నాకు ఎప్పటినుంచో ఉంది. ఆ ప్రయత్నంలోనే ఈ మిషన్కు మద్దతునిస్తున్నా’ అన్నారామె.