సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణంలో యువతులు పోటీ పరీక్షల కోసం చదువుకునేందుకు ఢిల్లీలోని నార్త్వెస్ట్ జిల్లా యంత్రాంగం కరాలా గ్రామంలో ఓ లైబ్రరీని ఏర్పాటు చేసింది. ఆ జిల్లాలో ఎక్కడా మహిళలకు ప్రత్యేక గ్రంథాలయాలు లేవు. కొన్ని ప్రైవేట్ లైబ్రరీలున్నా దూరంగా ఉండేవి. దీంతో పోటీ పరీక్షలకు సిద్ధపడే యువతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఆ కష్టాన్ని గమనించిన జిల్లా అధికారులు చెప్టా యాదవ్, సౌమ్యశర్మ కమ్యూనిటీ లైబ్రరీ ఏర్పాటుకు సహకారం అందించారు. ఇక్కడ యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధపడేవారికి ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తారు. నాణ్యమైన స్టడీ మెటీరియల్ను అందిస్తారు. ఇక్కడి నుంచే తాజాగా ఓ మహిళ జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించింది. లక్షణమైన ఉద్యోగం సంపాదించుకుంది. అధికారుల అక్షర సేవ వృథాగా పోలేదు.