శంషాబాద్, జూలై 10: పట్టణాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని అందులో భాగంగా చేపట్టిన పట్టణ ప్రగతితో మున్సిపాలిటీల రూపురేఖలు మారిపోయాయని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. శనివారం పట్టణ ప్రగతి ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ నూతనంగా కొనుగోలు చేసిన వైకుంఠ రథం, నూతన పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసమే పట్టణ ప్రగతి చేపట్టినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యతగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సు ష్మారెడ్డి, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, కమిషనర్ సాబేరలి పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసమే హరితహారం కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. పట్టణ ప్రగతి ముగింపు సందర్భంగా నిర్వహించిన హరిత హారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, కమిషనర్ సాబేరలి తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి ముగింపు సందర్భంగా రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్రెడ్డితో కలిసి బండ్లగూడలో పలు బస్తీల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో లక్ష మొక్కలను పంపిణీ చేసినట్లు తెలిపారు. మేనేజర్ మనోహర్, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మేయర్ మహేందర్గౌడ్, డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్రెడ్డి, కార్పొరేటర్ అస్లాంబిన్ అబ్దుల్లా, కార్పొరేటర్ ప్రశాంత్ దర్గాఖలీజ్ఖాన్, సాయినగర్, సాయిబాబానగర్ తదితర ప్రాంతాల్లో మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఈ శారద, ఏఈ రాజీవ్రెడ్డి, కోఆప్షన్ సభ్యులు మాలాకీరత్నం, జగదీశ్, తదితరులు పాల్గొన్నారు.