ముందుగా టమాటాల్ని ముక్కలుగా కోసి కారం, అల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నెలో టమాట మిశ్రమం వేసి అందులో ఉప్మా రవ్వ, బియ్యపు పిండి, గోధుమ పిండి, ఉప్పు, మిరియాల పొడి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి రెండు కప్పుల నీళ్ళుపోసి, బాగా కలిపి పదిహేను నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన నీళ్ళు కూడా పోసి పిండిని పల్చగా కలుపుకొని దోశలు వేసుకుంటే చాలు.