కావలసిన పదార్థాలు
రాగి పిండి: రెండు టేబుల్ స్పూన్లు, క్యారెట్: ఒకటి, బీన్స్: నాలుగు, పచ్చి బఠాణి: పావు కప్పు, ఉల్లిపాయ: ఒకటి(చిన్నది), పచ్చిమిర్చి: రెండు, వెల్లుల్లి రెబ్బలు: రెండు, అల్లం: చిన్న ముక్క, ఉప్పు: తగినంత, జీలకర్ర: అర టీ స్పూన్, మిరియాలపొడి: పావు టీ స్పూన్, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర: కొద్దిగా
తయారీ విధానం
ముందుగా క్యారెట్, బీన్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వీలైనంత చిన్నగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్మీద పాన్ పెట్టి, నూనె వేడయ్యాక జీలకర్ర వేయాలి. బాగా వేగాక తరిగిన ముక్కలన్నిటితోపాటు పచ్చి బఠాణీలు కూడా వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి, రెండు కప్పుల నీళ్ళు పోసి పదినిమిషాలపాటు మూత పెట్టి ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికిపోయాక, రాగిపిండిని ఒక కప్పు నీళ్ళలో ఉండలు లేకుండా కలిపి, మరుగుతున్న మిశ్రమంలో పోయాలి. మరో పదినిమిషాలపాటు సన్నని మంటపై మరిగించి, చివరగా కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి రాగి వెజ్ సూప్ రెడీ.