కావలసిన పదార్థాలు: గుడ్లు: మూడు, మైదా: అర కప్పు, కార్న్ఫ్లోర్: పావు కప్పు, పెరుగు: అర కప్పు, అల్లం: అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, పచ్చిమిర్చి: నాలుగు, కారం: ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా: ఒక టీ స్పూన్, బ్రెడ్ క్రంబ్స్: కొద్దిగా, కరివేపాకు: రెండు రెబ్బలు, కొత్తిమీర తురుము: ఒక టేబుల్ స్పూన్, చక్కెర: చిటికెడు, చిల్లీసాస్: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా
తయారీ విధానం: ముందుగా రెండు గుడ్లను ఉడకబెట్టి వాటిలోని తెలుపు భాగాన్ని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాటిని ఒక పాత్రలోకి తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, కారం, తరిగిన అల్లం ముక్కలు, గరం మసాలా, బ్రెడ్ క్రంబ్స్, పిండి వేసి కలపాలి. ఇందులో గుడ్డు కొట్టి, ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేలా కలియబెట్టాలి. కడాయిలో నూనె వేడయ్యాక మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ నూనెలో వేయాలి. గోధుమరంగులోకి మారేవరకు వేయించి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్పై గిన్నెపెట్టి కాస్త నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. కాసేపు వేగిన తర్వాత పెరుగు, చిల్లీ సాస్, కారం, గరం మసాలా, చక్కెర, కొత్తిమీర వేశాక, వేయించి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని వేసి కలియబెట్టాలి. కాసేపు వేయించిన తర్వాత దించుకుంటే ఎగ్ 65 రెడీ.