కావలసిన పదార్థాలు
మైదా: ఒక కప్పు, బియ్యపు పిండి: పావు కప్పు, పుల్లటి పెరుగు: ఒక కప్పు, ఉప్పు: తగినంత, వంట సోడా: చిటికెడు, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి: పావుకప్పు, జీలకర్ర: ఒక టీస్పూన్, నూనె: సరిపడా
తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో మైదా, బియ్యపు పిండి, పెరుగు, ఉప్పు, వంటసోడా, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ బజ్జీల పిండిలా కాస్త జారుగా కలపాలి. బాగా కలిపిన మిశ్రమాన్ని దాదాపు మూడు గంటలపాటు పక్కనపెట్టాలి. ఇప్పుడు స్టవ్మీద కడాయి పెట్టి, వేయించడానికి సరిపడా నూనెపోసి, పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న బజ్జీల్లా వేసుకుంటే కరకరలాడే చల్ల పునుగులు రెడీ. ఇవి పల్లీ, టమాట చట్నీతో బాగుంటాయి.