కీసర, జూన్ 29 : పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతాయని జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం పల్లె ప్రగతిపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పల్లెప్రగతి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో పాల్గొనాలని, ప్రతి పనిని పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.
సాగునీరు, కరెంట్, శానిటేషన్, డంపింగ్యార్డు, ఫారెస్ట్, వ్యవసాయశాఖ, హెచ్ఎండబ్ల్యూ, ఆర్డబ్ల్యూఎస్, డ్రింకింగ్, డ్రైనేజీ, పంచాయతీరాజ్ వంటి పలు రకాల పనులు పల్లె ప్రగతిలో తీసుకొని సక్సెస్ చేయాలన్నారు. ఈ శాఖలకు సంబంధించిన అధికారులందరూ పాల్గొని పల్లెప్రగతి పనుల్లో ప్రగతి సాధించాలన్నారు. ఆయా గ్రామాల్లోని సర్పంచ్లు గ్రామాల్లో చేపట్టే ప్రతిపనికి తీర్మానం చేసి, ఎంబీ రికార్డు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, ఎంపీపీ మల్లారపు ఇందిరాలక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, ఎంపీడీవో పద్మావతి, ఎంపీవో మంగతాయారు, వివిధ గ్రామాల సర్పంచ్లు నాయకపు మాధురివెంకటేశ్, ఆకిటి మహేందర్, కౌకుట్ల గోపాల్రెడ్డి, పుట్ట రాజుముదిరాజ్, పెంటయ్య, తుంగ ధర్మేందర్, ఎంపీటీసీలు తటాకం నారాయణశర్మ, మంచాల కిరణ్జ్యోతి, జూపల్లి వెంకటేశ్తో పాటు వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.