కేబినెట్ ఆమోదంతో అందనున్న కార్డులు
పెరగనున్న లబ్ధిదారులు..
ఆదిలాబాద్, జూన్ 9 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సర్కారు సాహస నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలుపరుస్తూనే.. నిరుపేదలు ఆకలితో అలమటించకూడదని ఉచితంగా అదనంగా బియ్యం అందజేస్తున్నది. దరఖాస్తు చేసుకొని ‘రేషన్’ కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త కార్డులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆదిలాబాద్ జిల్లాలో 6,385.. నిర్మల్లో 6,856.. మంచిర్యాలలో 19,047.. కుమ్రం భీం ఆసిఫాబాద్లో 3,850 మంది కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ కార్డులు అందనుండగా.. ఉచిత బియ్యం కూడా ఇవ్వనున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,441 రేషన్ దుకాణాలు ఉండగా.. 7,32,998 కార్డులు ఉన్నాయి.. అదనంగా 36,138 కార్డులను సర్కారు ఇవ్వనున్నది.
పేదలకు నిత్యావసర సరుకులను ప్రభుత్వం తక్కువ ధరలకు చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నది. రూ. కిలో బియ్యం, కిరోసిన్, ఇతర వస్తువులను సర్కారు రేషన్ దుకాణాలు ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్నది. ఇందుకుగాను అర్హులు వారు రేషన్కార్డులు తీసుకోవాల్సి ఉంటుంది. పేదల దరఖాస్తులను పరిశీలించిన అధికారులు అర్హులకు కార్డులు పంపిణీ చేస్తారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా 36,138 మందికి రేషన్కార్డులను ప్రభుత్వం అందించనున్నది. ఆదిలాబాద్ జిల్లాలో 6,385, నిర్మల్లో 6856, మంచిర్యాలలో 19,047, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 3850 మందికి కొత్త కార్డులు మంజూరు కానున్నాయి.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 3,81,692 రేషన్కార్డులు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి నెల కుటుంబంలోని ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున 8,350 మెట్రిక్ టన్నుల బియ్యం అందిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో 355 చౌకధరల దుకాణాలు 1,88,480 రేషన్ కార్డులు, నిర్మల్ జిల్లాలో 390 రేషన్ షాపులు, 1,92,852 కార్డులు ఉన్నాయి. బియ్యం ఇతర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సర్కారు పంపిణీ చేస్తున్న బియ్యం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సర్కారు ఉచితంగా ఇస్తున్న బియ్యంతో పేద కుటుంబాలు కడుపు నిండా భోజనం చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా పేదలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం రేషన్కార్డులు ఉన్న వారికి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నది. జూన్ కోటాలో కుటుంబంలోని ఒక్కొక్కరికి 15 కిలోల బియ్యం ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది. సర్కారు అందిస్తున్న సాయంతో ఉపాధి కోల్పోయిన పేదలు కష్టకాలంలో సైతం కడుపునిండా భోజనం చేస్తున్నారు. రెండు జిల్లాల్లో కొత్తరేషన్కార్డుల మంజూరుతో వీటి సంఖ్య 9,94,933కి చేరనుంది.
రెండు జిల్లాల్లో13,241 దరఖాస్తులు
కొత్త రేషన్కార్డులు మంజూరులో భాగంగా అధికారులు ఇప్పటికే 13,241 దరఖాస్తులు స్వీకరించారు. ఆదిలాబాద్ జిల్లాలో 6385 మంది, నిర్మల్ జిల్లాలో 6856 మంది దరఖాస్తు చేసుకున్నారు. నిర్మల్ జిల్లా భైంసా మండలంలో 981 మంది, బాసర మండలంలో 76, దస్తురాబాద్లో 141 మంది, కడెంలో 248 , ఖానాపూర్ లో 477, కుభీర్లో 288 , కుంటాలలో 226, లక్ష్మణచాందలో 155, లోకేశ్వరంలో 278, మథోల్ లో 665, మామడలో 108, నర్సాపూర్ (జీ) లో 272, నిర్మల్ రూరల్ లో 324, నిర్మల్ అర్బన్లో 1286, పెంబిలో 58, సారంగాపూర్లో 401, సోన్లో 290, తానూర్లో 429 మంది రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ అర్బన్ మండలంలో 1257 మంది, ఆదిలాబాద్ రూరల్ మండలంలో 393, బజార్హత్నూర్లో 282, బేలలో 279, భీంపూర్లో 240, బోథ్లో 438, గాదిగూడలో 131, గుడిహత్నూర్లో 203, ఇచ్చోడలో 299, ఇంద్రవెల్లిలో 281, జైనథ్లో 443, మావలలో 552, నార్నూర్లో 151, నేరడిగొండలో 179, సిరికొండలో 122, తలమడుగులో 489, తాంసిలో 182, ఉట్నూర్లో 464 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన వారికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.
ఆదేశాలు రాగానే అమలు చేస్తాం..
కొత్త రేషన్కార్డుల కోసం నిర్మల్ జిల్లాలో సుమారు 6వేల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం తీసు కున్న నిర్ణయంతో అర్హులకు కార్డులు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే అమలు చేస్తాం..
-డీఎస్వో కిరణ్కుమార్,నిర్మల్