సిటీబ్యూరో, జూలై 9(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ విభాగం ఆధ్వర్యంలో సర్వర్ల నిర్వహణలో భాగంగా ఈ నెల 9 (శుక్రవారం ) రాత్రి పది గంటల నుంచి 11వ తేదీ వరకు అన్ని రకాల ఆన్లైన్ సర్వీసులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆర్టీసీ బస్సు పాసుల జారీ ప్రక్రియ 9, 11 తేదీలలో నిలిపివేస్తూ ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరిగి 11న బస్సు పాసుల జారీ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సివిల్ సప్లయ్ శాఖలోని ఇ-పాస్ సేవలు కూడా ఈ నెల 10న నిలిపివేస్తున్నట్లు జిల్లా చీఫ్ రేషనింగ్ అధికారి బాల మాయాదేవి శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 11 నుంచి యథావిధిగా ఇ-పాస్ సేవలు ప్రారంభిస్తామన్నారు.