అది ముంబయి రైల్వేస్టేషన్. అప్పుడే ప్లాట్ఫామ్ పైకి వచ్చిన రైల్లోకి ఓ 15 ఏండ్ల అమ్మాయిని బలవంతంగా ఎక్కిస్తున్నాడు ఒక వ్యక్తి. అంతలోనే అక్కడికొచ్చిందో పోలీసు అధికారి. అప్పటికే అక్కడ మాటు వేసిన ఖాకీలు క్షణాల్లో అతడిని చుట్టుముట్టారు. ఇలా దుర్మార్గుల చెర నుంచి వందలాది బాలికలను, యువతులను రక్షించింది రేఖా మిశ్రా. మహారాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు రేఖ విజయ
గాథను పాఠ్యాంశంగా చేర్చింది. రేఖా మిశ్రాది ముంబయి. తండ్రి సైన్యంలో పనిచేశారు. బాల్యం నుంచీ రేఖ పోలీసు కావాలని కలలు కనేది. కష్టపడి చదివి ఇష్టమైన ఎస్ఐ ఉద్యోగాన్ని దక్కించుకుంది. ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్లో మహిళలు, బాలికల అక్రమ రవాణా వ్యతిరేక విభాగానికి ఆమెను కేటాయించారు. ఆరేండ్ల సర్వీసులో దాదాపు వెయ్యిమందిని రక్షించింది. తనను కేంద్ర
ప్రభుత్వం ‘నారీ శక్తి’ అవార్డుతో గౌరవించింది. అలా వచ్చిన నగదునూ అనాథలకే కేటాయించింది.