ఇతరులతో పంచుకొంటే ఆనందం రెట్టింపు అవుతుంది. మనసులోని బాధను చెప్పుకొంటే సగానికి సగం తగ్గిపోతుంది. కాకపోతే, ఆ ఆనంద విషాదాలను ఓపిగ్గా, శ్రద్ధగా వినేందుకు ఓ శ్రోత దొరకాలి. అప్పుడే, మెదడు ఆరోగ్యం బాగుంటుందని తాజా అధ్యయనం నిర్ధారిస్తున్నది. యుక్త వయసు నుంచి వృద్ధాప్యం వరకూ.. అన్ని దశల్లోనూ ఊకొట్టేవాళ్లు దొరకడం అదృష్టమే. ఇంటర్నేషనల్ మెడికల్ జర్నల్లో ప్రచురితమైన ఓ నివేదికలో ఈ ప్రస్తావన ఉంది. అందువల్ల, కుటుంబ సభ్యులు ఏ విషయం గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు, మిగిలిన వారు శ్రద్ధగా ఆలకించాలని సలహా ఇస్తున్నారు. ఎన్వైయూ గ్రాస్మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లోని న్యూరాలజీ ప్రొఫెసర్ జోయల్ శాలినాస్. దీనివల్ల వయసుతోపాటు వచ్చే అల్జీమర్స్నూ నివారించవచ్చట.