హైదరాబాద్ : క్యాన్సర్ మానసిక క్షోభను కలిగిస్తుందని సినీ నటుడు, బసవతారకం క్యాన్సర్స్ ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపతి 21వ వార్షికోత్సవం మంగళవారం జరగ్గా.. బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రి 22వ వసంతంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు. అనేక కారణాలతో ప్రజలు క్యాన్సర్ బారినపడుతున్నారని తెలిపారు. ఖరీదైన వైద్యాన్ని పేదలకు చేరువ చేయాలనే ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్టు పేర్కొన్నారు. ఆసుపత్రి వంద పడకల నుంచి 500పైగా పడకలకు చేరిందన్నారు. అత్యాధునిక పరికరాలతో రోగులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బ్లాక్ ఫంగస్ సోకిన ఆరుగురికి ఆసుపత్రిలో చికిత్స అందించి, డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.