హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీశ్చంద్ర శర్మ సోమవారం ప్రమాణం స్వీకరించనున్నారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఉదయం 11.05 గంటలకు ఆయనతో ప్రమాణం చేయిస్తారు. కొవిడ్ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్తోపాటు మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, కొద్దిమంది ముఖ్యులు మాత్రమే హాజరుకానున్నారు. ఇందుకోసం రాజ్భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.