కావలసిన పదార్థాలు
జొన్నలు: ఒక కప్పు, పెసర పప్పు: అరకప్పు, మిరియాలు: పది, ఉప్పు: తగినంత, పచ్చిమిర్చి: నాలుగు, క్యారెట్: ఒకటి, ఉల్లిగడ్డ: ఒకటి, టమాట: ఒకటి, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, పోపు గింజలు: ఒక టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, కొత్తిమీర: తగినంత
తయారీ విధానం
ముందుగా జొన్నలను బాగా కడిగి, రెండు గంటలపాటు నానబెట్టాలి. కప్పు జొన్నలకు రెండు కప్పుల నీళ్ళు పోసి కొంచెం ఉప్పు, ఒక టీ స్పూన్ నూనె వేసి ప్రెషర్ కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు, స్టవ్మీద పాన్పెట్టి నూనె వేడయ్యాక పోపు గింజలు, మిరియాలు, తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక తరిగిన టమాట, క్యారెట్ జోడించి తగినంత ఉప్పు, పసుపు వేసి.. ఉడికించిన జొన్నలను జోడించి బాగా కలిపి పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే జొన్న కిచిడీ రెడీ.