మధుమేహాన్ని నియంత్రించడంలో పనస కీలకపాత్ర పోషిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం మెడికల్ కాలేజి, మహారాష్ట్రలోని పుణె మెడికల్ ఇన్స్టిట్యూట్ల సంయుక్త పరిశోధనలోనూ ఇదే విషయం వెల్లడైంది. షుగర్ లెవల్స్ను నియంత్రించడంలో ఈ పండు మెండుగా పనిచేస్తుందని నిర్ధారించారు. మధుమేహం ఉన్నవారు, ప్రీ-డయాబెటిస్ రోగులు తరచూ పనసపండును తినాలని సూచిస్తున్నారు. పనసను ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలో గ్లూకోజ్ శాతం తగ్గుతుందని కూడా వీరి పరిశోధనలో తేలింది. టైప్-2 డయాబెటిస్ ఉన్న 40 మంది రోగులతో.. వరి, గోధుమలకు బదులుగా పనస పిండితో చేసిన వంటకాలను మూడు నెలలపాటు తినిపించారు. కేవలం ఏడురోజుల్లోనే వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినట్లు గుర్తించారు.