వెంగళరావునగర్,జూన్ 20 : ప్రభుత్వ ఛాతి దవాఖానను సూపర్ స్పెషాలిటీ దవాఖానగా మార్చాలని నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, కార్పొరేటర్లు, నాయకులు,కార్యకర్తలతో కలిసి ఆదివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద రోగులకు మెరుగైన వసతులు కల్పించేందుకు వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని ఈ దవాఖానను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చి సీఎం పేదల మనస్సులు గెల్చుకున్నారని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, దేదీప్య, సీఎన్ రెడ్డి, వనం సంగీత యాదవ్, బాబా ఫసియుద్దీన్, రాజ్ కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.