మళ్లీ మట్టిపాత్రల హవా మొదలైంది. అమ్మమ్మల కాలంలో అన్నం, కూర.. మట్టి గిన్నెల్లోనే వండేవారు. పాలు, పెరుగు కూడా మట్టి పాత్రల్లోనే. చాయ్ గ్లాసులు, నీళ్ల చెంబులు, రంజన్లు.. అన్నీ మట్టితో చేసినవే. నేటితరం మళ్లీ వీటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. స్టీలుతో పోలిస్తే ధర కాస్త ఎక్కువైనా.. వంటింట్లో మట్టితో చేసిన వంట గిన్నెలు, దోశ పెంకలు, కుక్కర్లు, చాయ్ లోటాలు విరివిగా వాడుతున్నారు జనం. ప్రస్తుతం, రాజస్థానీలు చేత్తో చేసే ‘పొక్రాన్’ అనే గుడ్ల ట్రేలు ఆన్లైన్ మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. వీటి ధర రూ.550 వరకూ ఉంటుంది.