సినిమావాళ్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. ఫ్యాన్స్తో టచ్లో ఉంటూ.. ఎప్పటికప్పుడు కెరీర్ గురించీ, పర్సనల్ విషయాల గురించీ అప్డేట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు షేర్ చేయడంతో పాటు నెటిజన్లకు సలహాలు, సూచనలూ ఇస్తున్నారు. తాజాగా నటి త్రిష కూడా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్కు చక్కటి సలహా ఇచ్చింది. “ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో ఎవరూ నిరుత్సాహపడకండి. పర్ఫెక్ట్గా ఉండాలన్న తపనతో ఇబ్బందుల పాలు కాకండి. నిజాయతీగా ఉండండి చాలు” అనిఇన్స్టా పోస్ట్లో రాసుకొచ్చింది.