పెరుగుతో మామిడిపండ్లను కలుపుకొని తింటారు చాలామంది. కానీ, శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే గుణాలున్న రెండు పదార్థాలను కలిపి తినకూడదంటున్నారు నిపుణులు. విడివిడిగా తింటే రెండిటితోనూ ఆరోగ్యానికి లాభమే!
మినుపపప్పుతో చేసిన వంటల విషయంలోనూ అంతే. ఉదాహరణకు వడల్ని పెరుగులో నానబెట్టి తింటారు. కానీ, అలా తినకూడదట. పెరుగుతో ఉల్లిపాయ కలిపి తిన్నా జీర్ణ సంబంధ సమస్యలతోపాటు ఎసిడిటీ వచ్చే ఆస్కారం ఉందంటున్నారు నిపుణులు.
చేపలతోనూ పెరుగును కలిపి తినకూడదు. అలాగే, వేపుళ్ళతోనూ పెరుగు మంచిది కాదు. అందుకని, పెరుగును దేనితో పడితే దానితో తినకుండా కొంచెం జాగ్రత్త పడితే సరి!